యాప్నగరం

మీ సాయాన్ని మరువలేం.. చంద్రబాబుకు కేరళ సీఎం లేఖ

ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచారు. మీ సాయాన్ని మర్చిపోలేము..

Samayam Telugu 16 Sep 2018, 3:39 pm
వరదలతో చిగురుటాకులా వణికిపోయిన కేరళకు యావత్ భారతావని బాసటగా నిలిచింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. మేమున్నామంటూ చేయి, చేయి కలిపి సాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం.. కేరళకు అండగా నిలిచాయి. తోచిన విధంగా సాయం చేసి పెద్ద మనసును చాటుకున్నాయి. ఆ తర్వాత వరదలు తగ్గముఖం పట్టడంతో కేరళలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చేసిన సాయాన్ని మర్చిపోకూడదంటూ సీఎం పినరయి విజయన్.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Samayam Telugu Pinarayi


కేరళ సీఎం విజయన్ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆపదలో అండగా నిలిచి ఆదుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున రూ.10కోట్లు.. ఉద్యోగులు, ప్రజలు, వివిధ సంస్థల ద్వారా మరో రూ.40కోట్లను అందిరించారని లేఖలో ప్రస్తావించారు. పెద్ద మనసుతో స్పందించి.. మీ ప్రభుత్వం చేసిన సాయం.. సాటి భారతీయులుగా ప్రజలు స్పందించిన తీరుకు గర్విస్తున్నానన్నారు విజయన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.