యాప్నగరం

ఏపీ ఎంపీల రాయబారం.. తగ్గేది లేదన్న టీఆర్ఎస్

లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ అలా మొదలయ్యిందో లేదో అన్నా డీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ వెల్‌లోకి వచ్చేస్తున్నారు. ఇంకేముంది స్పీకర్ వెంటనే వాయిదా వేస్తున్నారు. రోజూ ఇదే పంచాయితీ. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో... ఏపీ ఎంపీలు రూటు మార్చారు. ఆందోళన చేస్తున్న ఎంపీల దగ్గరకు రాయబారానికి వెళ్లారు.

Samayam Telugu 21 Mar 2018, 12:10 pm
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ అలా మొదలయ్యిందో లేదో అన్నా డీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ వెల్‌లోకి వచ్చేస్తున్నారు. ఇంకేముంది స్పీకర్ వెంటనే వాయిదా వేస్తున్నారు. రోజూ ఇదే పంచాయితీ. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో... ఏపీ ఎంపీలు రూటు మార్చారు. ఆందోళన చేస్తున్న ఎంపీల దగ్గరకు రాయబారానికి వెళ్లారు. సభకు కాస్త సహకరించండి బాబూ అంటూ తమ ఆవేదనను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అవిశ్వాసంపై చర్చ రోజూ వాయిదా పడుతూనే ఉందని... సభకు సహకరించి చర్చ జరిగేలా చూడాలని ఎంపీలను కోరారు.
Samayam Telugu Telugu Mps


ఏపీ ఎంపీల విజ్ఞ‌ప్తిని అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు తోసిపుచ్చారు. తమ రాష్ట్రానికి సంబంధించిన హక్కులపై పోరాడుతున్నామని... ఈ విషయంలో వెనక్కు తగ్గే సమస్యే లేదన్నారు. టీఆర్ఎస్ కూడా అదే విషయాన్ని చెప్పింది. రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసనను కొనసాగిస్తామని తేల్చి చెప్పిందట. పరిస్థితి చూస్తే ఈసారి అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.