యాప్నగరం

హెచ్ఐసీసీలో ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్ భేటీ

మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్స్ సమిట్ (జీఈఎస్) ప్రారంభోత్సవం కోసం నేడు నగరానికి వచ్చిన...

TNN 28 Nov 2017, 4:02 pm
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్స్ సమిట్ (జీఈఎస్) ప్రారంభోత్సవం కోసం నేడు నగరానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాంక ట్రంప్‌ కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. మియాపూర్ మెట్రో రైలు స్టేషన్‌లో మెట్రో రైలుకి పచ్చజండా ఊపి హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం మియాపూర్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలీకాప్టర్ల ద్వారా నేరుగా హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు.
Samayam Telugu pm modi and ivanka trump reached to hicc to inaugurate ges 2017
హెచ్ఐసీసీలో ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్ భేటీ


ఇదిలావుంటే ఇవాంక ట్రంప్‌ కూడా అక్కడికి సమీపంలోని ట్రైడెంట్‌ హోటల్‌ నుంచి బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా భారీ బందోబస్తు మధ్య నేరుగా హెచ్ఐసీసీ ప్రాంగణానికి వచ్చారు. ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్ లాంటి వీవీఐపీల రాక నేపథ్యంలో హైటెస్ సిటీ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు.

ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఈ సాయంత్రం 4.30 గంటలకు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుయర్స్ సమిట్ ప్రారంభం కానుంది. ఈ సదస్సులో పాల్గొని తమ అనుభవాలని పంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్ అక్కడికి చేరుకోవడానికన్నా కొద్దిముందే విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ అక్కడికి చేరుకున్నారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.