యాప్నగరం

సోదర సోదరీమణులారా.. తెలుగు ప్రజలకు మోదీ విషెస్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విషెస్ చెబుతూ ప్రత్యేక ట్వీట్లు చేశారు.

Samayam Telugu 2 Jun 2018, 3:23 pm
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విషెస్ చెబుతూ ప్రత్యేక ట్వీట్లు చేశారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. రానున్న సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
Samayam Telugu modi2


‘ఆంధ్రప్రదేశ్‌ సోదర, సోదరీమణులారా.. మీకు శుభాభినందనలు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ మరో ట్వీట్‌ చేశారు. 2014 జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు చేపడుతోంది.


రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘అభివృద్ధి బాటలో సాగుతున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. రాష్ట్ర పురోగతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు కోవింద్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.