యాప్నగరం

హైదరాబాద్‌ అంటే పటేల్‌ గుర్తొస్తారు..: మోదీ

హైదరాబాద్‌ అద్భుతమైన నగరమని, ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌ పర్యటనకు విచ్చేసిన మోదీ బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు.

TNN 28 Nov 2017, 4:42 pm
హైదరాబాద్‌ అద్భుతమైన నగరమని, ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం (నవంబర్ 28) హైదరాబాద్‌ పర్యటనకు విచ్చేసిన మోదీ బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ‘సోదర సోదరీమణులారా.. అందరికీ శుభాకాంక్షలు. హైదరాబాద్‌కు అద్భుతమైన నగరం. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్‌ అంటే నాకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గుర్తొస్తారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో కలిపి ఆయనకు ఈ వీరభూమి నుంచి వందనం చేస్తున్నా. తెలంగాణ విమోచనంలో ప్రాణాలర్పించిన అమరులందరికీ జోహార్లు’ అని మోదీ అన్నారు.
Samayam Telugu pm modi interacts with telangana bjp leaders at begumpet
హైదరాబాద్‌ అంటే పటేల్‌ గుర్తొస్తారు..: మోదీ


అనంతరం హిందీలో మాట్లాడిన మోదీ.. సహకార సమాఖ్య వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రాజనీతిలో భేదాలు ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్రాల వికాసం, వాటి అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ సౌభాగ్యాన్ని మార్చేస్తామని ప్రధాని తెలిపారు. ‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అభినందనలు. తెలంగాణ వికాసం కోసం భారత సర్కార్ ఎలాంటి లోటు రానివ్వదు. ఈ రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉంది’ అని మోదీ అన్నారు.

​భారత మాత సేవ కోసం తెలంగాణ బీజేపీ పరిశ్రమించిందని, దాని వల్లే బీజేపీ దేశంలో పెద్ద పార్టీగా అవతరించిదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.