ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం గుంటూరు చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, డీజీపీ ఆర్పీ ఠాకూర్, కామినేని శ్రీనివాస్ తదితర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అందరికీ సాదరంగా పలకరించిన మోదీ అనంతరం హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులెవరూ మోదీకి స్వాగతం పలికేందుకు రాలేదు. గుంటూరు పర్యటనలో భాగంగా కృష్ణపట్నం బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఓఎన్జీసీ వశిష్ఠ, ఎస్1 అభివృద్ధి పథకాలను, విశాఖపట్నంలో భూగర్భ ముడిచమురు నిల్వ కేంద్రాన్ని అక్కడి నుంచే జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12.30కి గుంటూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని దిల్లీ వెళ్లిపోతారు.
గుంటూరు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ప్రారంభమైంది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్, డీజీపీ, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆయన గుంటూరు వెళ్లారు
Samayam Telugu 10 Feb 2019, 11:17 am
ప్రధానాంశాలు:
- ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు.
- గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఆయన గుంటూరు వెళ్లారు.
- అక్కడ వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు.