యాప్నగరం

మోదీ గుంటూరు పర్యటన.. ఇదిగో షెడ్యూల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పర్యటనకు వస్తున్నారంటూ నిలదీస్తోంది. రేపటి గుంటూరు సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది.

Samayam Telugu 12 Feb 2019, 6:42 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఏపీ పర్యటనకు వస్తోన్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న గుంటూరు నగరంలో ప్రధాని పర్యటించనున్నారు. గుంటూరు వేదికగా పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. రేపటి మోదీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu Modi


✦ ఉదయం 10.45: విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో గుంటూరుకు పయనం
✦ ఉదయం 11.05: గుంటూరు చేరిక
✦ ఉదయం 11.15: గుంటూరు బైపాస్‌లోని ఏటుకూరు చేరిక (బహిరంగ సభ వేదిక)
✦ ఉదయం 11.15 నుంచి 11.20: ప్రాజెక్టులపై ప్రధాన మంత్రి స్వల్ప ప్రసంగం
✦ ఉదయం 11.20 నుంచి 11.25: క్రిష్ణపట్నంలో నిర్మించనున్న బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్‌కు శంకుస్థాపన (బటన్ నొక్కి శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు)
విశాఖపట్నంలోని ఓఎన్జీసీ వశిష్టవ్, ఎస్1 డెవలెప్‌మెంట్ ప్రాజెక్టులు ఈఓఏ, ఎస్పీఆర్ ఫెసిలిటీ జాతికి అంకితం
✦ ఉదయం 11.25: తిరిగి గుంటూరుకు పయనం
✦ ఉదయం 11.30 నుంచి 12.15: గుంటూరులో బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం
✦ మధ్యాహ్నం 12.30: బహిరంగ సభ వేదిక నుంచి విజయవాడకు పయనం
✦ మధ్యాహ్నం 12.50: తమిళనాడు పర్యటన కోసం విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరిక
Also Read: రేపు మోదీ పర్యటన.. ఏపీ బీజేపీ నేతల్లో గుబులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.