యాప్నగరం

మోదీ స్కూటీ యోజన పథకం కేవలం దుష్ప్రచారం: పురందేశ్వరి

Purandeswari | పీఎం స్కూటీ యోజన పథకం ఓ దుష్ప్రచారం అని బీజేపీ నేత పురందేశ్వరి తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తను ఎవరూ నమ్మొద్దని తెలిపారు. అలాంటి పథకాలేవైనా ఉంటే ప్రధాని స్వయంగా చెబుతారన్నారు.

Samayam Telugu 18 Jul 2019, 8:41 pm
హిళల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకొచ్చిందని.. మోదీ స్కూటీ యోజన పేరుతో బైక్‌లు అందించనుందని సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు. ‘మోదీ స్కూటీ యోజన పథకం’ దుష్ప్రచారం అని స్పష్టం చేశారు. గురువారం (జులై 18) సాయంత్రం రాజమడ్రిలో మీడియాతో ఆమె మాట్లాడారు.
Samayam Telugu Purandeswari
పీఎం స్కూటీ యోజన


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పథకాన్ని ఎవరూ నమ్మొద్దని పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అలాంటి పథకాలేవైనా అమలు చేయాలని బావిస్తే ప్రధాని స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు.

Read Also: సీఎం జగన్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

పదోతరగతి పాసైన అమ్మాయిలు పై చదువులు చదువుకోవడం కోసం, చిరు ఉద్యోగాలు చేసే మహిళలు పని ప్రదేశాలకు వెళ్లి రావడానికి వీలుగా.. ప్రధాని మోదీ స్కూటీ యోజన పథకాన్ని ప్రారంభించారంటూ కొద్ది రోజులుగా వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఫేక్ వార్త అంటూ తెలుగువారి ‘సమయం’ ఇప్పటికే ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ వివరాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి..

Read Also:పీఎం స్కూటీ యోజన.. మహిళలకు స్కూటీలు ఇస్తున్నారా, ఇదిగో నిజం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.