యాప్నగరం

ప్రాణాలు తీసిన విషవాయువులు

మొగల్తూరులో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలో అయిదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

TNN 30 Mar 2017, 1:29 pm
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొగల్తూరులో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలో అయిదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. వారి మరణానికి విషవాయువులే కారణమయ్యాయి. అయిదుగురు కార్మికులు గురువారం ఉదయం రసాయనాల ట్యాంకును శుభ్రం చేసే పనిలో ఉన్నారు. అందులోంచి విష వాయువులు వెలువడడంతో కొన్ని నిమిషాల్లోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మిగతా ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీంతోవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మిగతా ఇద్దరూ కూడా మరణించారు. మరణించిన వారికి రాంబాబు, ఏడు కొండలు, ప్రవీణ్, ఈగ ఏడుకొండలు, శ్రీనివాసులు గా గుర్తించారు పోలీసులు. వీరి మరణంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
Samayam Telugu poisonous gas killed 5 in aqua unit in west godavari
ప్రాణాలు తీసిన విషవాయువులు


తుందుర్రు ఆక్వా యూనిట్ వద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇలా ఆక్వా యూనిట్ లోనే ప్రమాదం జరగడం అంతటా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తుందుర్రు ఆందోళనకారులకు అస్త్రమయ్యే అవకాశం ఉంది. కాగా సీఎం చంద్రబాబు జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు కలెక్టర్ లో మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.