యాప్నగరం

గుత్తి: ప్రయాణికుణ్ని చితక్కొట్టిన రైల్వే పోలీస్

అనంతపురంలోని గుత్తి రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుణ్ని రైల్వే పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. బెంగళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌‌ స్లీపర్ క్లాస్‌లో ఎక్కడానికి ప్రయత్నించిన సురేష్‌పై దాడి చేశారు.

TNN 15 Feb 2018, 10:24 pm
అనంతపురంలోని గుత్తి రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడిపై రైల్వే పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. బెంగళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ గుత్తి రైల్వే స్టేషన్ చేరుకున్న సమయంలో.. సురేష్‌ అనే ఓ ప్రయాణికుడు స్లీపర్ క్లాస్‌లో ఎక్కబోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతణ్ని వారించారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సురేష్ ఆ పోలీసులను ఎదిరించి మాట్లాడటం వారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఓ కానిస్టేబుల్ అతణ్ని లాఠీతో చితకబాదాడు.
Samayam Telugu police attacks passenger in gutti railway staion
గుత్తి: ప్రయాణికుణ్ని చితక్కొట్టిన రైల్వే పోలీస్


సురేష్‌పై పోలీస్ దాడి చేయడం పట్ల తోటి ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. దాడి చేస్తున్న దృశ్యాలను కొంత మంది ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై సురేష్‌ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అకారణంగా తనను రైల్వే పోలీసులు చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. జనరల్‌ క్లాస్ టిక్కెట్‌తో సురేష్ స్లీపర్‌ కోచ్‌ ఎక్కబోయాడని, నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే ఎదురుతిరిగాడని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.