యాప్నగరం

నల్లగొండ జిల్లాలో 2 అస్థిపంజరాలు.. పక్కనే చీర, ఇతర వస్తువులు

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం సత్రశాల సమీపంలోని చెట్ల పొదల్లో రెండు అస్థిపంజరాలు కనిపించాయి. మృతులు గుంటూరు వాసులుగా భావిస్తున్నారు.

TNN 19 Feb 2018, 5:08 pm
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం సత్రశాల సమీపంలోని చెట్ల పొదల్లో రెండు అస్థిపంజరాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సోమవారం (ఫిబ్రవరి 19) ఉదయం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అస్థిపంజరాల పక్కనే చీర, ఇతర దుస్తులు, చెప్పులు, డ్రైవింగ్ లైసెన్స్ లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఓ వ్యక్తితో పాటు మహిళ మరణించినట్లు నల్లగొండ పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా దర్యాప్తు చేయగా కొన్ని కీలక వివరాలు లభ్యమయ్యాయి.
Samayam Telugu police found 2 human skeletons in nalgonda
నల్లగొండ జిల్లాలో 2 అస్థిపంజరాలు.. పక్కనే చీర, ఇతర వస్తువులు


డ్రైవింగ్ లైసెన్స్‌పై కోరె అప్పారావు, తండ్రి వెంకటేశ్వర్లు, గంగవరం గ్రామం, గురజాల మండలం, గుంటూరు జిల్లా అని ఉంది. ఈ అడ్రస్ ఆధారంగా గురజాల పోలీసులకు సమాచారం అందించగా.. గంగవరం గ్రామానికి చెందిన కోరె అప్పారావుతో పాటు గురజాల గ్రామానికి చెందిన మువ్వా కాసులు అనే మహిళ జనవరి 1న అదృశ్యమైనట్లు తెలిపారు. ఈ మేరకు గురజాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆ అస్థిపంజరాలు అదృశ్యమైన వారిద్దరివే అయుంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే.. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా? అనేది తేలాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.