ఐలయ్యపై పొలిటికల్ పార్టీలు భగ్గు.. చర్యలు తప్పవన్న నాయిని
ఆర్యవైశ్యలపై పుస్తకం రాసి వివాదానికి కారణమైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఎదురుదాడి మరింత పెరిగింది.
TNN 22 Sep 2017, 8:58 am
ఆర్యవైశ్యలపై పుస్తకం రాసి వివాదానికి కారణమైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఎదురుదాడి మరింత పెరిగింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్యులంతా ఐలయ్యపై దుమ్మెత్తి పోస్తుండగా.. ఇప్పుడు ఈ అంశంపై తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్పందించాయి. ఐలయ్య వైఖరి సరికాదని తేల్చిచెప్పాయి. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఒక కులం గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. వైశ్యులను ఐలయ్య కించపరచడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించిన నాయిని.. ఆయనపై కేసులు నమోదైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు బీజేపీ కూడా ఐలయ్య తీరును తప్పుబట్టింది. ఒక సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతినేలా రచనలు చేయడం తగదని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఐక్యతకు భంగం కలిగించే రచనలు మానుకోవాలని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, న్యూడెమోక్రసీ నేతలు కూడా ఐలయ్యపై మండిపడ్డారు. మరోవైపు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఐలయ్య పుస్తకంపై ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐలయ్య దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
కాగా, ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం ఎంతటి వివాదానికి తెరలేపిందో అందరికీ తెలిసిందే. ఐలయ్య పుస్తకం స్పందించిన ఏపీ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్.. ఆయన్ని నడిరోడ్డుపై ఉరితీయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై ఐలయ్య ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీజీ వెంకటేష్పై కేసు పెట్టాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్.. టీజీ వెంకటేష్తో కుమ్మక్కై తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు బీజేపీ కూడా ఐలయ్య తీరును తప్పుబట్టింది. ఒక సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతినేలా రచనలు చేయడం తగదని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఐక్యతకు భంగం కలిగించే రచనలు మానుకోవాలని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, న్యూడెమోక్రసీ నేతలు కూడా ఐలయ్యపై మండిపడ్డారు. మరోవైపు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఐలయ్య పుస్తకంపై ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐలయ్య దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
కాగా, ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం ఎంతటి వివాదానికి తెరలేపిందో అందరికీ తెలిసిందే. ఐలయ్య పుస్తకం స్పందించిన ఏపీ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్.. ఆయన్ని నడిరోడ్డుపై ఉరితీయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై ఐలయ్య ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీజీ వెంకటేష్పై కేసు పెట్టాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్.. టీజీ వెంకటేష్తో కుమ్మక్కై తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.