మధ్యాహ్నం ఒంటిగంటకు నంద్యాల్లో పోలింగ్ పర్సెంటేజి 50 ని దాటేసినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి భారీ స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదకొండు గంటల సమయంలో 35 శాతం పోలింగ్ నమోదు అయినట్టుగా ఈసీ ప్రకటించింది. ఇక మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం 53కి చేరినట్టుగా తెలుస్తోంది.
ఉదయం ఏడుగంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కు అవకాశం ఉంది. ఆరుగంటలకు బూత్ క్యూల్లో నిలబడిన వారికి కూడా ఓటింగ్ అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ అలవోకగా 80 శాతాన్ని చేరే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఒకవైపు మధ్యాహ్నానికి ఎండ కూడా తీవ్రస్థాయికి చేరింది. అయినప్పటికీ ఓటర్లు క్యూల్లో వేచి ఉండటం గమనార్హం. మధ్యాహ్న సమయంలో కూడా పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు క్యూల్లో ఉండటంతో.. పోలింగ్ శాతం భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కొన్ని గ్రామాల్లో అయితే.. ఇప్పటికే 75 శాతం వరకూ పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఐదారు వేల స్థాయి ఓట్లున్న చోట కూడా.. ఈ స్థాయిలో పోలింగ్ నమోదైన దాఖలాలు కనిపిస్తున్నాయి. అలాంటి చోట్ల సాయంత్రానికి 90 శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకూ పోలైన మొత్తం ఓట్లు లక్షా పదహారు వేల వరకూ ఉన్నాయి. వీటిల్లో పురుషుల ఓట్లు 59 వేలు కాగా, మహిళలు 56 వేల వరకూ ఉన్నాయి.
ఉదయం ఏడుగంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కు అవకాశం ఉంది. ఆరుగంటలకు బూత్ క్యూల్లో నిలబడిన వారికి కూడా ఓటింగ్ అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ అలవోకగా 80 శాతాన్ని చేరే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఒకవైపు మధ్యాహ్నానికి ఎండ కూడా తీవ్రస్థాయికి చేరింది. అయినప్పటికీ ఓటర్లు క్యూల్లో వేచి ఉండటం గమనార్హం. మధ్యాహ్న సమయంలో కూడా పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు క్యూల్లో ఉండటంతో.. పోలింగ్ శాతం భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కొన్ని గ్రామాల్లో అయితే.. ఇప్పటికే 75 శాతం వరకూ పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఐదారు వేల స్థాయి ఓట్లున్న చోట కూడా.. ఈ స్థాయిలో పోలింగ్ నమోదైన దాఖలాలు కనిపిస్తున్నాయి. అలాంటి చోట్ల సాయంత్రానికి 90 శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకూ పోలైన మొత్తం ఓట్లు లక్షా పదహారు వేల వరకూ ఉన్నాయి. వీటిల్లో పురుషుల ఓట్లు 59 వేలు కాగా, మహిళలు 56 వేల వరకూ ఉన్నాయి.