యాప్నగరం

పాదయాత్రలో జగన్‌ను కలిసిన పోసాని

ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిశారు సినీ దర్శకరచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి.

Samayam Telugu 26 May 2018, 2:53 pm
ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిశారు సినీ దర్శకరచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కుప్పనపూడి నుంచి శనివారం రోజున జగన్ పాదయాత్ర మొదలైంది. కుప్పనపూడి వద్దే పోసాని జగన్‌ను కలిశాడు. ప్రజాసంకల్పయాత్రకు పోసాని తన మద్దతు ప్రకటించారు. యాత్ర దిగ్విజయంగా సాగాలని పోసాని ఆకాంక్షించారు. జగన్‌తో కలిసి కాసేపు నడిచారు పోసాని.
Samayam Telugu posanij


ఇటీవల పోసాని వివిధ అంశాలపై స్పందిస్తూ తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. నంది అవార్డుల విషయంలో, ప్రత్యేకహోదా పోరాటం విషయంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారాయన. ఇప్పుడు జగన్‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం ఆసక్తిదాయకం.

నేటితో జగన్ పాదయాత్ర 172వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ జగన్ దాదాపు 2,144 కిలోమీటర్ల దూరాన్ని నడిచారు. మూడు వేల కిలోమీటర్ల దూరం లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ జగన్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో జగన్‌ను కలిసి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శుక్రవారం రోజున కోళ్లపర్రు వద్ద జగన్‌ను కలిసి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పలనాయుడు పార్టీలోకి చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.