ఒంటిమిట్టలో రాములోరి కల్యాణానికి హాజరై, ప్రసంగిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒంటిమిట్ట దేవాలయ ప్రశస్తిని వివరించబోయి చంద్రబాబు చేసిన ప్రసంగంలో తప్పులు దొర్లడంతో విమర్శకులు స్పందిస్తున్నారు. అది కూడా రామయణ రచన గొప్పదనాన్ని బమ్మెర పోతనకు ఆపాదించారు చంద్రబాబు. తన ప్రసంగంలో దొర్లిన తప్పును బాబు గ్రహించలేదు. ఈ నేపథ్యంలో బమ్మెర పోతన రాసింది రామాయణం కాదు.. అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే.. ‘కోదండరామ స్వామి కొలువైన ఒంటిమిట్ట ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తాం, ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడే రామాయణాన్ని రాసి ఈ దేవుడికి అంకితమిచ్చారు...’ అని అన్నారు.
తెలుగులో ప్రసిద్ధ కవి, గొప్ప భక్తుడు అయిన బమ్మెర పోతన రాసింది రామాయణం కాదు. ఆయన భాగవతాన్ని తెనుగీకరించారు. సంస్కృతంలోని భాగవతాన్ని తెలుగులోకి అద్భుతమైన రీతిలో అనువదించి.. తెలుగు వాళ్లకు అందించారు పోతన. ఆయన ఇంకా భోగినీదండకం,వీరభద్ర విజయం,నారాయణ శతకాలను రచించారని చరిత్ర చెబుతుంది.
అయితే చంద్రబాబు మాత్రం బమ్మెర పోతన రామాయణాన్ని రచించి, కోదండరామునికి అంకితం ఇచ్చారని అన్నారు. బాబు ఇలా ప్రసంగించడంపై కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే.. ‘కోదండరామ స్వామి కొలువైన ఒంటిమిట్ట ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తాం, ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడే రామాయణాన్ని రాసి ఈ దేవుడికి అంకితమిచ్చారు...’ అని అన్నారు.
తెలుగులో ప్రసిద్ధ కవి, గొప్ప భక్తుడు అయిన బమ్మెర పోతన రాసింది రామాయణం కాదు. ఆయన భాగవతాన్ని తెనుగీకరించారు. సంస్కృతంలోని భాగవతాన్ని తెలుగులోకి అద్భుతమైన రీతిలో అనువదించి.. తెలుగు వాళ్లకు అందించారు పోతన. ఆయన ఇంకా భోగినీదండకం,వీరభద్ర విజయం,నారాయణ శతకాలను రచించారని చరిత్ర చెబుతుంది.
అయితే చంద్రబాబు మాత్రం బమ్మెర పోతన రామాయణాన్ని రచించి, కోదండరామునికి అంకితం ఇచ్చారని అన్నారు. బాబు ఇలా ప్రసంగించడంపై కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.