ఎన్నికల సమయంలో తనను చంపేందుకు కుట్ర జరిగిందంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల సంఘం అధికారులు, సీఎం చంద్రబాబును కలిసినా తనకు సెక్యూరిటీని కల్పించలేదని.. ఆధారాలు సమర్పించినా పట్టించుకోలేదన్నారు. మోదీ, చంద్రబాబు, జగన్ తనకు శత్రువులన్న కేఏ పాల్.. కేసీఆర్ మిత్రుడో, శత్రువో తెలియదని.. ఎన్నికల ముందు వరకు ఆయన తనకు మంచి స్నేహితుడన్నారు. కేసీఆర్ కేవలం ఫాంహౌస్కు పరిమితమయ్యారని.. కేటీఆర్ తనపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాల్.. కేటీఆర్ను టార్గెట్ చేశారు. కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. తాను హైదరాబాద్ వచ్చానని కేసీఆర్,కేటీఆర్లకు నిద్రపట్టడం లేదన్నారు పాల్. ‘తెలంగాణకు మద్దతిచ్చింది నేనే.. కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు.. నేనంటే కేసీఆర్కు చాలా ప్రేమ. ఒకవేళ మీ నాన్న (కేసీఆర్)ను కలిస్తే..నా గురించి తెలుసుకో. పిచ్చి, పిచ్చి కామెంట్లు చేయొద్దు.. డబ్బు నీకు బాగా ఎక్కువైపోయినట్లుంది. నాతో పెట్టుకోవద్దు.. నేను కాంగ్రెస్ పార్టీని కాదు కొనడానికి.. కోదండరాంను కాదు. ఇక్కడ కేఏ పాల్.. ప్రపంచాన్ని షేక్ చేసి.. ఓడించి గెలిచొచ్చా’అంటూ చెలరేగారు.
‘కేటీఆర్ గతవారం చూసావ్గా.. శ్రీలంక కర్ఫ్యూలో ఒక కుక్కకూడా కదలకూడదు. అలాంటిది ప్రెసిడెంట్, ప్రధాని నన్ను తీసుకెళ్లి టీ, కాఫీలిచ్చి, భోజనాలు పెట్టారు.ఆ దేశానికి పర్సనల్గా 10 మిలియన్లు నిధులు ఇచ్చాను.. వందలాది మిలియన్లు ఇప్పించాను. ఓ దేశానికి లాభం చేశాను.. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ కట్టారా.. చంద్రబాబు కట్టారా. వందలమంది బిలినీయర్లను హైదరాబాద్ తీసుకొచ్చాను.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ను తీసుకొచ్చా.. నాతో గొడవ ఎందుకు పెట్టుకున్నావ్.. నేనేమన్నా కృష్ణమాదిగను అనుకున్నావా. నేను శపించానంటే మసైపోతావ్.. నువ్వు నీ కుటుంబం’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘2008లో మీ నాన్న(కేసీఆర్) గారు వచ్చారు.. గౌరవించా, ప్రార్థనలు చేశా.. సపోర్ట్ చేసి.. ఫండింగ్ ఇచ్చా. దిలీప్కుమార్కు తెలుసు.. ఆయనే మధ్యవర్తి. హైదరాబాద్కు ట్రంప్ను తీసుకొస్తానని కేటీఆర్నను లెటర్ ఇవ్వమన్నా.. ఇచ్చారా. అందుకే ట్రంప్ను రానిచ్చినా మూడేళ్లు. పిచ్చి కామెంట్ చేశాడు కేటీఆర్.. జాగ్రత్త. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం.. కేసీఆర్ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే నిద్రపోతారా. 23 ప్రాణాలు ఏడుస్తున్నాయి.. 23 కుటుంబాలు బాధలో ఉన్నాయి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘కేటీఆర్ చినజీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్ను పూజారులు కూడా కాపాడలేరు. నేను శాపం పెడితే నాశనమైపోతారు.. గొడవలొద్దు.. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో నాతో కలసిరావాలి. అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దాం.. నాకు ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్ను హైదరాబాద్ తీసుకొస్తాను. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్లో చేరుతున్నారు’అన్నారు పాల్.
‘కేటీఆర్ గతవారం చూసావ్గా.. శ్రీలంక కర్ఫ్యూలో ఒక కుక్కకూడా కదలకూడదు. అలాంటిది ప్రెసిడెంట్, ప్రధాని నన్ను తీసుకెళ్లి టీ, కాఫీలిచ్చి, భోజనాలు పెట్టారు.ఆ దేశానికి పర్సనల్గా 10 మిలియన్లు నిధులు ఇచ్చాను.. వందలాది మిలియన్లు ఇప్పించాను. ఓ దేశానికి లాభం చేశాను.. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ కట్టారా.. చంద్రబాబు కట్టారా. వందలమంది బిలినీయర్లను హైదరాబాద్ తీసుకొచ్చాను.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ను తీసుకొచ్చా.. నాతో గొడవ ఎందుకు పెట్టుకున్నావ్.. నేనేమన్నా కృష్ణమాదిగను అనుకున్నావా. నేను శపించానంటే మసైపోతావ్.. నువ్వు నీ కుటుంబం’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘2008లో మీ నాన్న(కేసీఆర్) గారు వచ్చారు.. గౌరవించా, ప్రార్థనలు చేశా.. సపోర్ట్ చేసి.. ఫండింగ్ ఇచ్చా. దిలీప్కుమార్కు తెలుసు.. ఆయనే మధ్యవర్తి. హైదరాబాద్కు ట్రంప్ను తీసుకొస్తానని కేటీఆర్నను లెటర్ ఇవ్వమన్నా.. ఇచ్చారా. అందుకే ట్రంప్ను రానిచ్చినా మూడేళ్లు. పిచ్చి కామెంట్ చేశాడు కేటీఆర్.. జాగ్రత్త. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం.. కేసీఆర్ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే నిద్రపోతారా. 23 ప్రాణాలు ఏడుస్తున్నాయి.. 23 కుటుంబాలు బాధలో ఉన్నాయి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘కేటీఆర్ చినజీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్ను పూజారులు కూడా కాపాడలేరు. నేను శాపం పెడితే నాశనమైపోతారు.. గొడవలొద్దు.. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో నాతో కలసిరావాలి. అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దాం.. నాకు ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్ను హైదరాబాద్ తీసుకొస్తాను. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్లో చేరుతున్నారు’అన్నారు పాల్.