యాప్నగరం

ఎగరని వైసీపీ జెండా... అధినేత అసహనం!

ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైసీపీ అధినేత ఈ నెల 6 న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం కర్నూలులో సాగుతోంది.

TNN 15 Nov 2017, 6:58 pm
ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైసీపీ అధినేత ఈ నెల 6 న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం కర్నూలులో సాగుతోంది. మంగళవారం నాటికి 100 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న జగన్ పాదయాత్ర బుధవారం ఆళ్లగడ్డ మండలంలోకి ప్రవేశించింది. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరుకు చేరుకున్న జగన్ అక్కడ తమ పార్టీ జెండాను ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే వైసీపీ జెండా ఎగరక పోవడంతో అధినేత కొంత అసహనానికి గురయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ జెండాను ఎగురవేయాలనుకుంటే అది ఎంతకీ ఎగరలేదు. జెండా ఆవిష్కరణకు రెండుసార్లు ప్రయత్నించినా జెండా ఎగరలేదు.
Samayam Telugu prajasankalpa yatra jagan serious about ycp flag hoisting at allagadda
ఎగరని వైసీపీ జెండా... అధినేత అసహనం!


దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. చివరకు ఓ బాలుడిని జెండా స్తంభంపైకి ఎక్కించి దానిని ఆవిష్కరించాల్సి వచ్చింది. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు సాయంత్రానికి ఆళ్లగడ్డ చేరుకున్నారు. బుధవారం ఉదయం ఆర్‌.కృష్ణాపురం నుంచి తొమ్మిదో రోజు పాదయాత‍్రను జగన్ మొదలుపెట్టారు. అక్కడ నుంచి పాలసాగరం మీదుగా ఆళ్లగడ్డ చేరుకున్న వైఎస్‌ జగన్‌ను ఐకేపీ యానిమేటర్లు కలిసి తమ సమస్యలను గురించి వినతి పత్రం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.