యాప్నగరం

Prakasam Barrage: కొనసాగుతున్న వరద.. ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పొంగిపొర్లుతుండగా.. గోదావరి పరుగులతో ధవళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతుంది.

Samayam Telugu 14 Aug 2018, 2:07 pm
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పొంగిపొర్లుతుండగా.. గోదావరి పరుగులతో ధవళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతుంది. ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లనూ ఎత్తి 63 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అక్కడ ప్రస్తుత నీటిమట్టం 57.05 అడుగులుగా ఉంది. కృష్ణమ్మ జలకళను చూడటానికి వచ్చిన జనాలతో బ్యారేజీ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కృష్ణా నదీ తీరం నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
Samayam Telugu prakasham


మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్‌కు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ఈ రోజు ఉదయం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం వద్ద 38 అడుగుల వద్ద నీటిప్రవాహం కొనసాగుతోంది. ఈ కారణంగా మంగళవారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.