యాప్నగరం

ప్రణయ్ భార్య అమృత పోరాటం మొదలైంది!

పురువు, కుల పిచ్చితో ప్రణయ్‌ని హత్య చేయించిన కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Samayam Telugu 17 Sep 2018, 7:18 pm
తనను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న భర్త పెరుమాళ్ల ప్రణయ్ ఆశయమైన క్యాస్టిజంపై పోరాడేందుకు అమృత వర్షిణి సిద్ధమైంది. అయితే ముందుగా ప్రణయ్‌ని హత్య చేసిన కేసులో నిందితులందరికీ శిక్ష పడాలని పరితపిస్తోన్న అమృత సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ అనే ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేసి తన భావాల్ని వ్యక్తం చేసింది.
Samayam Telugu Pranay And Amrutha Varshini


‘ప్రణయ్ నువ్వు దిగులు చెందవద్దు. నువ్వు ఇప్పుడు ఒంటరివి కాదు. నువ్వు నాతో పాటు కొన్ని కోట్ల గుండెల్లో ఉన్నావు. నీకు న్యాయం జరగాలని ఎంతో మంది తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని’ అమృత పోస్ట్ చేసింది. ప్రణయ్‌కి న్యాయం చేసేందుకు ఇది మంచి సాధనంగా వాడుకుంటానని అమృత ధీమాగా ఉంది. కాగా, పురువు, కుల పిచ్చితో ప్రణయ్‌ని హత్య చేయించిన కేసులో అమృత తండ్రి మారుతీరావును, హత్యకు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. ఆమెకు నెటిజన్ల నుంచి, పలు ప్రజా సంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

ప్రణయ్ లేని లోకంలో తాను ఉండకూడదని అమృత తొలుత భావించింది. అయితే అయితే తన కడుపులోని బిడ్డనే ప్రణయ్‌కి ప్రతిరూపంగా భావించి పెంచి పెద్ద చేసేందుకు తాను బతికుంటానని అమృత వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌, సుఫారీ కిల్లర్స్‌తో పాటు హత్యకు సహకరించిన నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.