యాప్నగరం

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కుటుంబం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీసమేతంగా శనివారం (సెప్టెంబర్ 2) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు మహాద్వారం వద్ద అర్చకులు..

TNN 2 Sep 2017, 9:48 am
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీసమేతంగా శనివారం (సెప్టెంబర్ 2) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు మహాద్వారం వద్ద అర్చకులు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, టీటీడీ జేఓ శ్రీనివాసరాజు, సీవీఎస్వో రవికృష్ణ, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో రాష్ట్రపతి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేసి సత్కరించారు.
Samayam Telugu president ram nath kovind couple visits tirupati balaji temple
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కుటుంబం


రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి తన రెండు రోజుల తిరుపతి పర్యటన ముగించుకొని ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.