యాప్నగరం

టెక్నాలజీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ను రాష్ట్రపతి బుధవారం (డిసెంబర్ 27) ప్రారంభించారు. టెక్నాలజీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు.

TNN 27 Dec 2017, 3:43 pm
టెక్నాలజీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ను రాష్ట్రపతి బుధవారం (డిసెంబర్ 27) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫైబర్‌ నెట్‌ లాంటి గొప్ప ప్రాజెక్టును ఏర్పాటుచేసిన ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అభినందనలు తెలిపారు.
Samayam Telugu president ram nath kovind inaugurates andhra pradesh fibre grid
టెక్నాలజీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: రాష్ట్రపతి


‘ఫైబర్‌ నెట్‌ బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది. డిజిటల్‌ ఏపీ సాధనలో ఫైబర్‌ నెట్‌ ఒక గొప్ప ముందడుగు. ఫైబర్‌ నెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని సేవలు అందించొచ్చు. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యున్నత సాంకేతిక నగరంగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు’ అని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.

అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అమరావతిలోని సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం (ఆర్టీజీఎస్‌) పనితీరును పరిశీలించారు. ఆర్టీజీఎస్‌ కేంద్రం విశేషాలను సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో ఫైబర్‌ నెట్‌ కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.