రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. శనివారం రాత్రి బొల్లారంలోని రాష్ట్రపతి రాజ్భవన్లో బస చేయనున్నారు. ఆదివారం రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో మొక్కలు నాటిన తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం చెన్నై వెళ్లి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని పరామర్శిస్తారు. అనంతరం ఆయన తిరువనంతపురంలో జరిగే కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ వేడుకలు ‘ఫెస్టివల్ ఆఫ్ డెమక్రసీ’లో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో మొక్కలు నాటిన తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం చెన్నై వెళ్లి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని పరామర్శిస్తారు. అనంతరం ఆయన తిరువనంతపురంలో జరిగే కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ వేడుకలు ‘ఫెస్టివల్ ఆఫ్ డెమక్రసీ’లో పాల్గొంటారు.