యాప్నగరం

నోట్ల రద్దు పర్యవసానాలపై ప్రధాని ఆరా

పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత నెలకొన్న పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆరాతీశారు.

TNN 26 Nov 2016, 8:49 am
పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత నెలకొన్న పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆరాతీశారు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ఎలా జరుగుతోంది.. ప్రజలు ఏ తరహా సమస్యలను ఎదుర్కుంటున్నారని కేసీఆర్ ను మోడి ఆరా తీసినట్లు తెలుస్తోంది. డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం మోడి హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధానికి శంషాబాద్ విమానాశ్రయంలో కేసీఆర్ తో పాటు, ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు.
Samayam Telugu prime minsister narendramodi and telangana cm kcr short conversation on demoentization
నోట్ల రద్దు పర్యవసానాలపై ప్రధాని ఆరా


షెడ్యూల్ ప్రకారం ప్రధాని విమానాశ్రయం నుండి నేరుగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడెమీకి వెళ్లాల్సి ఉంది. కానీ, కేసీఆర్, గవర్నర్లతో కొద్దిసేపు మాట్లాడేందుకు ప్రధాని ఆగారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల గురించి గవర్నరును, తెలంగాణ సీఎంను అడిగి తెలుసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరమైనంత నగదు నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆయన అడిగారు. అలాగే రైతుల పరిస్థితి గురించి కూడా మోడి ప్రత్యేకంగా ఆరా తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.