యాప్నగరం

ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల కక్కుర్తి!

వరస సెలవులున్నాయని స్వస్థలాలకు బయలుదేరితే ట్రావెల్ యజమానుల కక్కుర్తి వల్ల తమ సమయమంతా హరించుకుపోయిందని ప్రయాణికులు..

TNN 12 Aug 2017, 6:08 pm
కొంత మంది ప్రైవేట్ బస్సు యాజమానుల కక్కుర్తి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అంతర్రాష్ట్ర రవాణా పన్నులు తప్పించుకోడానికి బస్సులను అటవీ మార్గాల్లో తీసుకెళుతున్నారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 11) రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌ బయలుదేరిని ‘మార్నింగ్‌ స్టార్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌’కు చెందిన ఓ బస్సు విషయంలో ఇదే జరిగింది. అనంతపురం, కర్నూలు మీదుగా హైదరాబాద్‌ రావాల్సిన ఆ బస్సును డ్రైవర్.. దారి మళ్లించి వేరేదారిలో తీసుకొచ్చాడు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవాల్సిన బస్సు 10 గంటల వరకు కూడా కర్ణాటక సరిహద్దును దాటలేదు. దీంతో ప్రయాణికులు బస్సును ఆపించి డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu private travels buses wrong root to avoid tax
ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల కక్కుర్తి!


ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ప్రయాణికులు వేరే మార్గంలో వెళుతున్నట్టు గ్రహించి బస్సు డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో టోల్‌ ట్యాక్స్‌ తప్పించుకునేందుకే బస్సును దారి మళ్లించినట్టు డ్రైవర్‌ చెప్పాడు. కిడ్నాప్ చేస్తున్నారేమోనని భయపడ్డట్టు కొంత మంది మహిళా ప్రయాణికులు చెప్పారు.

కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బూదగుంపలో కొద్దిసేపు వాగ్వాదం తర్వాత ఉదయం 10 గంటలకు బస్సు హైదరాబాద్‌కు బయల్దేరింది. సాయంత్రం 4 గంటలకు గానీ, బస్సు హైదరాబాద్ చేరుకోలేదు. వరస సెలవులున్నాయని స్వస్థలాలకు బయలుదేరితే ట్రావెల్ యజమానుల కక్కుర్తి వల్ల తమ సమయమంతా హరించుకుపోయిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. చాలా ట్రావెల్స్‌కు చెందిన బస్సులూ ఇదేవిధంగా చేస్తున్నాయని వాళ్లు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.