యాప్నగరం

కోమటోళ్లకు కోపం తెప్పించిన కంచ ఐలయ్య పుస్తకం

ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యుల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది.

TNN 10 Sep 2017, 11:58 pm
ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యుల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంలో కోమటోళ్ల గురించి కంచ ఐలయ్య రాసిన అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా వున్నాయని ఆర్యవైశ్యుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వెళ్లగక్కారు. ఆర్యవైశ్యుల మనోభావాలని కించపరిచి, వారి ప్రతిష్టని దెబ్బతీసేలా వున్న ఈ పుస్తకంపై నిషేధం విధించి పుస్తక రచయిత, పబ్లిషర్స్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలకి దిగిన ఆర్యవైశ్యులు.. కంచ ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
Samayam Telugu prof kanche ilaiahs samajika smugglers komatollu book creates controversy
కోమటోళ్లకు కోపం తెప్పించిన కంచ ఐలయ్య పుస్తకం


దేశంలో సంఖ్యా పరంగా చిన్న సామాజిక వర్గమైన కోమటోళ్ల దగ్గరే అధిక మొత్తంలో సంపద దాగి వున్నందున కోమటోళ్లు దేశానికి సైనికులుగా సేవ చేయాల్సిన అవసరం వుందని కంచ ఐలయ్య తాను రాసిన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ఈ వివాదం స్పందించిన కంచ ఐలయ్య.. ఆ పుస్తకం ఇప్పుడు రాసింది కాదని అన్నారు. సమాజంలోని అన్ని కులాలపై చేసిన సమగ్రమైన పరిశోధనలో భాగమే ఈ పుస్తకం అని కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకం గురించి తనకి చాలామంది నుంచి రకరకాల బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేసిన ఆయన.. తనని బెదిరించిన వాళ్లందరిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తానని స్పష్టంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.