యాప్నగరం

నెల్లూరులో సైకో వీరంగం.. మహిళలే టార్గెట్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. కేవలం అరగంట వ్యవధిలోనే ఐదుగురు మహిళలపై దాడికి

TNN 3 Mar 2018, 11:10 am
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. కేవలం అరగంట వ్యవధిలోనే ఐదుగురు మహిళలపై దాడికి దిగి.. అందర్నీ భయబ్రాంతులకి గురిచేస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కోవూరులో లైబ్రరీ సెంటర్ వద్ద టిఫిన్ సెంటర్ నడుపుతున్న ఓ వృద్ధురాలిపై సైకో తొలుత అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో.. కత్తితో గాయపరిచి పరారయ్యాడు. ఆ తర్వాత.. పక్కవీధిలో ఒంటరిగా ఉన్న మరో మహిళపై కూడా సైకో ఇదే దారుణానికి పాల్పడేందుకు ప్రయత్నించగా.. ఆమె కేకలు వేయడంతో అక్కడికి వచ్చిన ఓ యువకుడ్ని గాయపర్చి సైకో పారిపోయాడు.
Samayam Telugu psycho attack on women in nellore district
నెల్లూరులో సైకో వీరంగం.. మహిళలే టార్గెట్


ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే.. మరో వీధిలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ చెంపపై కొట్టి పరుగు తీసిన సైకో.. మరో ఇంట్లోకి చొరబడి రోకలి బండతో గృహిణిని తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం పాత ఆంధ్రా బ్యాంక్ సమీపంలో ఉంటున్న మరో యువతిపై కూడా దాడిచేశాడు. ఇలా అరగంట వ్యవధిలోనే.. మహిళలను లక్ష్యంగా చేసుకుని సైకో వీరంగం సృష్టించడం జిల్లాలో సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడి చేసిన ప్రతి చోటా ‘నాకు డబ్బులు ఇవ్వాలి కదా..? ఎప్పుడిస్తావ్..?’ అంటూ సైకో గట్టిగా అరిచినట్లు బాధితులు చెప్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.