విరసం నేత వరవరరావును పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ నిర్భంధంలో ఉన్న వరవరరావు ఇంటికి వచ్చిన పుణె పోలీసులు ఆయనను ట్రాన్సిట్ వారెంట్పై అదుపులోకి తీసుకొని పుణెకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో వరవరరావును గృహ నిర్భంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఇంతకుముందే ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వరవరరావు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలోనే వరవరరావును పుణే పోలీసులు శనివారం (నవంబర్ 17) రాత్రి అరెస్టు చేశారు. మోదీపై హత్యకు కుట్ర చేశారనేది వరవరరావు ప్రధాన అభియోగం. ఈ కేసులో ఆయనతో పాటు మరికొందరిపై పుణెలో కేసు నమోదైంది.
పది మందికి పైగా సభ్యులతో కూడిన పుణే పోలీసుల బృందం.. వరవరరావు ఇంట్లో అరగంట పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనతో మాట్లాడి పుణెలో నమోదైన కేసుకు సంబంధించి కస్టడీలోకి తీసుకుంటున్నట్లు సమాచారం అందించారు.
వరవరరావును అరెస్టు చేయడానికి ముందు ఆయన ఇంట్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అరెస్టుకు ముందు చివరిసారిగా కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తానని ఆయన కోరగా.. పుణే పోలీసులు అంగీకరించారు. అనంతరం భార్య, పిల్లలు, ఇతర బంధువులతో కలిసి ఆయన రాత్రి భోజనం చేశారు. అనంతరం అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వరవరరావు సతీమణి ఆయణ్ని కౌగిలించుకొని బోరున విలపించారు. దీంతో బంధువులంతా కంటతడిపెట్టారు.
వరవరరావును అరెస్టు చేస్తున్న విషయం తెలుసుకొని ఆయన నివాసం వద్దకు స్థానికులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. పుణే పోలీసులు, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరవర రావును విడుదల చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గాంధీనగర్లోని వరవరరావు ఇంటి వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ప్రజల గొంతులను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. తెలంగాణ పోలీసుల సహకారంతోనే ఈ దాడులు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. వరవరరావు గొంతును ఆపేయాలనే కుట్రలో బాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని కేసీఆర్ సర్కార్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ప్రధాన మంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే వార్తల్లో నిజం లేదన్నారు.
వరవర రావును అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆయణ్ని వెంటబెట్టుకొని పుణేకు బయలుదేరారు. సోమవారం ఉదయం ఆయణ్ని పుణే కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.
పది మందికి పైగా సభ్యులతో కూడిన పుణే పోలీసుల బృందం.. వరవరరావు ఇంట్లో అరగంట పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనతో మాట్లాడి పుణెలో నమోదైన కేసుకు సంబంధించి కస్టడీలోకి తీసుకుంటున్నట్లు సమాచారం అందించారు.
వరవరరావును అరెస్టు చేయడానికి ముందు ఆయన ఇంట్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అరెస్టుకు ముందు చివరిసారిగా కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తానని ఆయన కోరగా.. పుణే పోలీసులు అంగీకరించారు. అనంతరం భార్య, పిల్లలు, ఇతర బంధువులతో కలిసి ఆయన రాత్రి భోజనం చేశారు. అనంతరం అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వరవరరావు సతీమణి ఆయణ్ని కౌగిలించుకొని బోరున విలపించారు. దీంతో బంధువులంతా కంటతడిపెట్టారు.
వరవరరావును అరెస్టు చేస్తున్న విషయం తెలుసుకొని ఆయన నివాసం వద్దకు స్థానికులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. పుణే పోలీసులు, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరవర రావును విడుదల చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గాంధీనగర్లోని వరవరరావు ఇంటి వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ప్రజల గొంతులను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. తెలంగాణ పోలీసుల సహకారంతోనే ఈ దాడులు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. వరవరరావు గొంతును ఆపేయాలనే కుట్రలో బాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని కేసీఆర్ సర్కార్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ప్రధాన మంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే వార్తల్లో నిజం లేదన్నారు.
వరవర రావును అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆయణ్ని వెంటబెట్టుకొని పుణేకు బయలుదేరారు. సోమవారం ఉదయం ఆయణ్ని పుణే కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.