యాప్నగరం

ప్రేమించి పెళ్లి చేసుకుని వారం తర్వాత వదిలేశాడు!

ప్రేమ పేరుతో రెండేళ్లు వెంటబడిన యువకుడ్ని నమ్మిన ఓ యువతి, పెళ్లి చేసుకున్న వారం రోజులకే అతడు వదిలేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు లబోదిబోమంటోంది.

Samayam Telugu 14 Dec 2018, 2:05 pm
Samayam Telugu anantapur2
ప్రేమ పేరుతో రెండేళ్లు వెంటబడిన యువకుడ్ని నమ్మిన ఓ యువతి, పెళ్లి చేసుకున్న వారం రోజులకే అతడు వదిలేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు లబోదిబోమంటోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి సమీపంలోని ఎనుములపల్లికి చెందిన బాధితురాలు సౌభాగ్యబాయి డీఎడ్ కోర్సు చేసింది. ఈ నేపథ్యంలో కోనాపురానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ రెండేళ్లుగా వెంటపడ్డాడు. అతడి మాటలను నిజమేనని నమ్మిన సౌభాగ్య అతడి ప్రేమను అంగీకరించింది. దీంతో ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ వారం కిందట పెళ్లి చేసుకున్నారు. వారం రోజులు ఆమెతో కాపురం చేసిన గోవర్దన్, తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఆమెకు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం ప్రయత్నించిన సౌభాగ్య మొబైల్‌ కూడా కూడా స్విచాఫ్‌ రావడంతో అతడి స్వగ్రామానికి వెళ్లింది.

అతడ్ని వెదుక్కుంటూ గురువారం కోనాపురం వెళ్లింది. అయితే, వారి ఇంటికి తాళం వేసి ఉండటంతో నిరాశతో వెనుదిరిగింది. రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, నమ్మించి మోసం చేశాడని గ్రహించిన ఆ యువతి, చేసేదేమీ లేక, తన ఊరికి తిరిగి పయనమైంది. మార్గ మధ్యలో పెడపల్లి బస్టాండ్‌‌లో దిగి, అక్కడే దిగాలుగా కూర్చుండిపోయింది. ఒంటరిగా కూర్చుని ఏడుస్తోన్న ఆ యువతిని చూసిన స్థానికులు జరిగిన విషయం గురించి తెలుసుకున్నారు. ఆమె కథ తెలుసుకుని, ఓదార్చారు. పరారైన అతడిని పట్టుకుని న్యాయం జరిపిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.