యాప్నగరం

పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలి

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,

Samayam Telugu 28 Jun 2017, 12:28 pm
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి నుంచి ప్రధానమంత్రి పదవి వరకు ఆయన అన్ని పదవులకు వన్నె తెచ్చారని కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని జ్జానభూమి (పీవీ సమాధి)ని సందర్శించి నివాళులు అర్పించారు.
Samayam Telugu pv narasimha rao should be honoured with bharatratna ts minister
పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలి



దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ ఆధ్యుడు అని మంత్రులు కొనియాడారు. నేడు టెక్నాలజీ, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఇంతలా రావడానికి ఆనాడు పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలే కారణమని గుర్తు చేశారు. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య , ఇతర కాంగ్రెస్ నేతలు పీవీ ఘాట్ ను దర్శించిన నివాళులు అర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.