యాప్నగరం

లోకేశా.. పీవీ పీఎం అయ్యింది టీడీపీ నుంచా?!

ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మళ్ళీ కాంట్రవర్సీలో కాలేశారు.

Samayam Telugu 28 Jun 2017, 2:44 pm
ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మళ్ళీ కాంట్రవర్సీలో కాలేశారు. దివంగత పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి అయ్యింది తెలుగుదేశం పార్టీ నుంచి అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. తాను మాట్లాడింది తప్పని గుర్తించిన లోకేష్.. వెంటనే సవరించుకొని.. ‘తెలుగు ప్రజల నుంచి పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యారంటూ’ చెప్పారు. బుధవారం పీవీ 96వ జయంతి సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన పీవీ జయంతి వేడుకల్లో లోకేష్ పాల్గొన్నారు.
Samayam Telugu pv narsimha rao became from tdp says lokesh
లోకేశా.. పీవీ పీఎం అయ్యింది టీడీపీ నుంచా?!


ఈ యేడాది ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడిన లోకేష్.. జయంతిని వర్ధంతి అంటూ ప్రసంగించారు. లోకేష్ కామెంట్ పై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

జీవితాంతం కాంగ్రెస్ లో కొనసాగిన పీవీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం కావడంతో పాటు అనేక పదవులు నిర్వహించి.. దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అలాంటి నేత టీడీపీ నుంచి పీఎం అయ్యారని తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు మొదలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.