యాప్నగరం

పోచంపల్లి చీరతో సింధుకు సీఎం సత్కారం

స్టార్ షట్లర్ పీవీ సింధు బుధవారం (ఆగస్టు 30) సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధును కేసీఆర్ అభినందించారు. సింధుతో పాటు కోచ్ గోపీచంద్..

TNN 30 Aug 2017, 7:01 pm
సింధు భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని పతకాలు సాధించి పెడుతుందని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అన్నారు. స్టార్ షట్లర్ పీవీ సింధు బుధవారం (ఆగస్టు 30) సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధును కేసీఆర్ అభినందించారు. సింధుతో పాటు కోచ్ గోపీచంద్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. వీరిద్దరికీ చేనేత శాలువాలు కప్పి, పోచంపల్లి చీరలు, కరీంనగర్‌కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ మెమెంటో ఇచ్చి సత్కరించారు.
Samayam Telugu pv sindhu and pullella gopichand meet cm kcr
పోచంపల్లి చీరతో సింధుకు సీఎం సత్కారం


వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్స్‌లో చివరి నిమిషం వరకు సింధు పట్టు వదలకుండా పోరాడి భారతీయుల హృదయాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో సింధు పోరాటం అద్భుతమని, తాము చూసిన అత్యుత్తమ ఫైనల్స్‌లో ఇదొకటి పలువురు కితాబిచ్చారు.
World Badminton Silver medalist @pvsindhu1 & champion coach Pullella Gopichand have been congratulated by Hon'ble CM KCR Garu @TelanganaCMO pic.twitter.com/gSIs6k3qiS — KTR (@KTRTRS) August 30, 2017
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచిన పి.వి.సింధు, సైనా నెహ్వాల్ మంగళవారం (ఆగస్టు 29) ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిని గవర్నర్ నరసింహన్ అభినందించారు.

Telangana CM K Chandrsekhar Rao gifted Handloom Shawls and Pochampalli Sarees along with Silver filigree memento from Karimnagar to Pvsindhu and Gopichand.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.