యో ఒలింపిక్స్ లో పతకం కొట్టి భారతదేశం మన్ననలు పొందింది పీవీ సింధు. రియో నుంచి వచ్చాక తెలుగు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆమె శనివారం హైదరాబాద్ లోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆలయానికి విచ్చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది తానూ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటానని, అది ఆనవాయితీగా పెట్టుకున్నానని తెలిపారు. ఒలింపిక్స్లో పతకం సాధిస్తే వస్తానని మొక్కుకున్నట్టు, ఆ మొక్కును తీర్చుకునేందుకు వచ్చినట్టు తెలిపారు.
మహంకాళి ఆలయంలో స్టార్ షట్లర్
రియో ఒలింపిక్స్ లో పతకం కొట్టి భారతదేశం మన్ననలు పొందింది పీవీ సింధు.
TNN 27 Aug 2016, 1:31 pm