సినీ ఫక్కీలో రూ. 4 కోట్ల విలువైన సిగరెట్లను దోపిడీ చేసిన ఘరానా దొంగలు దొరికారు. హైదరాబాద్ నగర శివారు హయత్నగర్లో ఆగస్టు 20న జరిగిన సిగరెట్ల లారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెందిన కంజర్ ముఠాలోని నలుగురు దొంగలను అరెస్టు చేశారు. మొత్తం 24 మంది ఈ దోపిడీలో పాల్పంచుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. త్వరలో మిగతా వారిని అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. మనోజ్ సిసోడియా, రాజీవ్ అనే ఇద్దరు వ్యక్తులను దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు.
సిగరెట్ల లోడుతో వెళుతున్న కంటైనర్ను దారి మళ్లించి, డ్రైవర్ను బెదిరించి.. అందులోని సిగరెట్లను మరో వాహనంలో పట్టుకుపోయిన ఉదంతం గత నెలలో హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. కంటైనర్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కోస్టల్ రోడ్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన కంటైనర్ ఆగస్టు 20 రాత్రి 10.30 గంటల సమయంలో ముషీరాబాద్లోని ఐటీసీ లిమిటెడ్ నుంచి రూ. 4,10,12,667 విలువైన ‘గోల్డ్ ఫ్లేక్’ సిగరెట్లతో చిత్తూరు జిల్లా రేణుగుంటకు బయలుదేరింది. రాము అనే రూట్ గైడ్ కంటైనర్లో ఉప్పల్ వరకు వెళ్లి డ్రైవర్ అఖిలేష్ కుమార్ యాదవ్కు దారి చూపించి దిగిపోయాడు.
ఆ తర్వాత కాసేపటికే సుమారు 30 మంది దుండగులు రెండు సుమోలు, ఒక లారీతో కంటైనర్ను వెంబడించారు. పెద్ద అంబర్పేట దాటిన తర్వాత ఔటర్ రింగురోడ్డు వద్దకు చేరుకోగానే వాహనాలతో కంటైనర్ను అడ్డుకున్నారు. కంటైనర్ క్యాబిన్లోకి ఎక్కి డ్రైవర్ను చంపేస్తామని బెదిరించి, అతణ్ని డ్రైవింగ్ సీటులో నుంచి పక్కకు లాగి తాళ్లతో కట్టేశారు. దుండగుల్లో ఒకడు కంటైనర్ నడుపుకుంటూ యాదాద్రి జిల్లా మల్కాపురం శివారుకు తీసుకెళ్లాడు.
అక్కడ రోడ్డు పక్కన కంటైనర్ను నిలిపేసి డ్రైవర్ను అడవిలోకి తీసుకెళ్లారు. అతణ్ని చితకబాది గంటసేపు అక్కడే కూర్చోబెట్టారు. ఈ లోగా కంటైనర్లోని సిగరెట్లను మరో వాహనంలోకి ఎక్కించుకొని, అక్కడ నుంచి పరారయ్యారు. అడవిలో నుంచి అతి కష్టం మీద రోడ్డుపైకి వచ్చిన అఖిలేష్.. సమీపంలోని దాబా యజమాని సాయంతో చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దేశంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ తరహా కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు.. 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా నిందితులను అరెస్టు చేసి గొప్ప ముందడుగు వేశారు. చోరీకి గురైన రూ. 4 కోట్ల విలువైన సిగరెట్ల గురించి ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వనస్థలిపురంలో గతంలో కొన్ని లారీలు చోరీకి గురైన ఘటనలతోనూ వీరికి సంబంధం ఉన్నట్లు తెలిపారు. అనుమానం రాకుండా.. కొన్నిసార్లు కొత్త లారీలను కూడా కొనుక్కొచ్చి చోరీలకు పాల్పడ్డారని సీపీ వివరించారు.
సిగరెట్ల లోడుతో వెళుతున్న కంటైనర్ను దారి మళ్లించి, డ్రైవర్ను బెదిరించి.. అందులోని సిగరెట్లను మరో వాహనంలో పట్టుకుపోయిన ఉదంతం గత నెలలో హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. కంటైనర్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కోస్టల్ రోడ్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన కంటైనర్ ఆగస్టు 20 రాత్రి 10.30 గంటల సమయంలో ముషీరాబాద్లోని ఐటీసీ లిమిటెడ్ నుంచి రూ. 4,10,12,667 విలువైన ‘గోల్డ్ ఫ్లేక్’ సిగరెట్లతో చిత్తూరు జిల్లా రేణుగుంటకు బయలుదేరింది. రాము అనే రూట్ గైడ్ కంటైనర్లో ఉప్పల్ వరకు వెళ్లి డ్రైవర్ అఖిలేష్ కుమార్ యాదవ్కు దారి చూపించి దిగిపోయాడు.
ఆ తర్వాత కాసేపటికే సుమారు 30 మంది దుండగులు రెండు సుమోలు, ఒక లారీతో కంటైనర్ను వెంబడించారు. పెద్ద అంబర్పేట దాటిన తర్వాత ఔటర్ రింగురోడ్డు వద్దకు చేరుకోగానే వాహనాలతో కంటైనర్ను అడ్డుకున్నారు. కంటైనర్ క్యాబిన్లోకి ఎక్కి డ్రైవర్ను చంపేస్తామని బెదిరించి, అతణ్ని డ్రైవింగ్ సీటులో నుంచి పక్కకు లాగి తాళ్లతో కట్టేశారు. దుండగుల్లో ఒకడు కంటైనర్ నడుపుకుంటూ యాదాద్రి జిల్లా మల్కాపురం శివారుకు తీసుకెళ్లాడు.
అక్కడ రోడ్డు పక్కన కంటైనర్ను నిలిపేసి డ్రైవర్ను అడవిలోకి తీసుకెళ్లారు. అతణ్ని చితకబాది గంటసేపు అక్కడే కూర్చోబెట్టారు. ఈ లోగా కంటైనర్లోని సిగరెట్లను మరో వాహనంలోకి ఎక్కించుకొని, అక్కడ నుంచి పరారయ్యారు. అడవిలో నుంచి అతి కష్టం మీద రోడ్డుపైకి వచ్చిన అఖిలేష్.. సమీపంలోని దాబా యజమాని సాయంతో చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దేశంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ తరహా కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు.. 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా నిందితులను అరెస్టు చేసి గొప్ప ముందడుగు వేశారు. చోరీకి గురైన రూ. 4 కోట్ల విలువైన సిగరెట్ల గురించి ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వనస్థలిపురంలో గతంలో కొన్ని లారీలు చోరీకి గురైన ఘటనలతోనూ వీరికి సంబంధం ఉన్నట్లు తెలిపారు. అనుమానం రాకుండా.. కొన్నిసార్లు కొత్త లారీలను కూడా కొనుక్కొచ్చి చోరీలకు పాల్పడ్డారని సీపీ వివరించారు.