అధికారంలోకి వచ్చిన వెంటనే మేకిన్ ఇండియా నినాదం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ రాఫెల్ ఒప్పందాన్ని అనిల్అంబానీకి కట్టబెట్టి మేకిన్ ఇండియా బ్రోకర్స్ అనే కొత్త విధానాన్ని సృష్టించారని కేంద్ర మాజీమంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఎస్.జైపాల్రెడ్డి ఆరోపించారు. రాఫెల్ ఒప్పందం ఓ కుంభకోణమనీ, దీంతో అనిల్ అంబానీకి లబ్ధి చేకూరిందని ఆరోపించారు.
రక్షణశాఖ మంత్రికి కానీ, విదేశాంగశాఖ కార్యదర్శికి కానీ తెలియకుండా మోదీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడితో రాఫెల్ ఒప్పందంపై సంతకాలు చేశారని మండిపడ్డారు. జైపాల్రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందం కుదరడానికి రెండు రోజుల ముందు అప్పటి విదేశాంగకార్యదర్శి విలేకర్లతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ జరపబోయే చర్చల్లో రాఫెల్పై చర్చలు ఉండబోవని చెప్పారని, కానీ ప్రధానమంత్రి ఒప్పందంపై సంతకాలు చేశారని ఆరోపించారు.
అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు. రాఫెల్ ఒప్పందంలో హెచ్ఏఎల్ను తొలగించి తన కంపెనీని చేరుస్తారని అనిల్ అంబానీకి ముందే తెలుసని, అందుకే దానికి 12 రోజుల ముందే సంబంధిత కంపెనీ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. రాఫెల్పై హెచ్ఏఎల్, దసాల్ట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ కార్యదర్శి చెప్పారని, కానీ రెండురోజులకే అంబానీ, దసాల్ట్కంపెనీల మధ్య సంతకాలు అయిపోయాయని గుర్తుచేశారు. కేవలం 36 విమానాలకే రూ.41 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు.
రక్షణశాఖ మంత్రికి కానీ, విదేశాంగశాఖ కార్యదర్శికి కానీ తెలియకుండా మోదీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడితో రాఫెల్ ఒప్పందంపై సంతకాలు చేశారని మండిపడ్డారు. జైపాల్రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందం కుదరడానికి రెండు రోజుల ముందు అప్పటి విదేశాంగకార్యదర్శి విలేకర్లతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ జరపబోయే చర్చల్లో రాఫెల్పై చర్చలు ఉండబోవని చెప్పారని, కానీ ప్రధానమంత్రి ఒప్పందంపై సంతకాలు చేశారని ఆరోపించారు.
అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు. రాఫెల్ ఒప్పందంలో హెచ్ఏఎల్ను తొలగించి తన కంపెనీని చేరుస్తారని అనిల్ అంబానీకి ముందే తెలుసని, అందుకే దానికి 12 రోజుల ముందే సంబంధిత కంపెనీ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. రాఫెల్పై హెచ్ఏఎల్, దసాల్ట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ కార్యదర్శి చెప్పారని, కానీ రెండురోజులకే అంబానీ, దసాల్ట్కంపెనీల మధ్య సంతకాలు అయిపోయాయని గుర్తుచేశారు. కేవలం 36 విమానాలకే రూ.41 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు.