యాప్నగరం

​భారతరత్న ఎన్టీఆర్ కా? చంద్రబాబు కా..?

ప్రధానమంత్రి మోడీ టేబుల్ మీద పెండింగ్ లో ఉన్న ఫైలు

TNN 29 May 2017, 12:45 pm
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హత్యకు గురై 21 సంవత్సరాలు అయ్యిందని.. ఆయన అల్లుడు చంద్రబాబే ఆ పని చేశారని.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. చంద్రబాబు ఔరంగజేబులాంటి వ్యక్తి అని రఘువీర వ్యాఖ్యానించారు.
Samayam Telugu raghuveera slams tdp
​భారతరత్న ఎన్టీఆర్ కా? చంద్రబాబు కా..?


తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానించడంపై కూడా రఘువీరారెడ్డి స్పందించారు. ఒకవైపు ఎన్టీఆర్ కు భారతరత్న ఫైలు ప్రధాని మోడీ టేబుల్ మీద ఉందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారని, అలాంటి సమయంలో మళ్లీ తీర్మానం చేయాల్సిన అవసరం ఏమిటి? అని రఘువీరారెడ్డి ప్రశ్నించారు.

ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని రఘువీరారెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోడీ టేబుల్ మీద పెండింగ్ లో ఉన్న ఫైలు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడానికి సంబంధించినదా? లేక చంద్రబాబుకు భారతరత్న ఇవ్వాలనేదా? అదీగాక సుజనా చౌదరి బ్యాంకుల వ్యవహారం ఫైలా? అని రఘువీరారెడ్డి వ్యంగ్యంగా ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.