యాప్నగరం

ఆయన దేశాలు తిరుగుతారు, ఆమె బతుకమ్మ..

కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది

Samayam Telugu 1 Jun 2017, 7:29 pm
కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. గురువారం సంగారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ప్రజాగర్జన’ పేరుతో బహిరంగసభ కొనసాగుతోంది. ఈ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ నేతలు హాజరయ్యారు.
Samayam Telugu rahul gandhi in telangana congress public meeting in sangareddy
ఆయన దేశాలు తిరుగుతారు, ఆమె బతుకమ్మ..


ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ కేసీఆర్ ఇంట్లో కూర్చొని బూటకపు సర్వేలు వెల్లడిస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. పోలీసులు టిఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

మాజీ మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ కేసీఆర్ పడక గదిలో కూర్చొని, కేటీఆర్ దేశా విదేశాల్లో తిరుగుతూ, కవిత బతుకమ్మ ఆడుతూ కాలాయపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూడేళ్ల పాలనలో దళితులు, బలహీన వర్గాలు, రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.