యాప్నగరం

కాలినడకన శ్రీవారి దర్శనానికి బయల్దేరిన రాహుల్

ఏపీలో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్, విభజన చట్టంలో పేర్కొన్న ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ మాటమార్చడంతో తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని అంటోంది.

Samayam Telugu 22 Feb 2019, 12:21 pm
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తిరుపతికి విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న రాహుల్‌కు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీపీ అధ్యక్షుడు రఘవీరాతో సహా కాంగ్రెస్ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి బస్సులో బయలుదేరిన రాహుల్, అలిపిరి చేరుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఆయన కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. కాలినడకన తిరుమల చేరుకుని మధ్యాహ్నం 3 గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతికి చేరుకుని సాయంత్రం 5 గంటలకు ‘ఏపీకి ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర’ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీ వైఖరిని ఆయన వెల్లడించనున్నారు. సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
Samayam Telugu rahul2


గత ఎన్నికల సమయంలో మోదీ తిరుపతి తారకరామ మైదానం వేదికగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హామీలిచ్చిన విషయం తెలిసిందే. అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బహిరంగ సభను నిర్వహిస్తోంది. హోదాపై మోదీ మాటమార్చిన తీరును రాహుల్‌ ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ వైఖరిని వెల్లడించనున్నారని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.