హమ్మయ్య అనుకుంటే.. ఇంకా ఆరున్నాయని చెప్పాడట!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు వింత అనుభవం ఎదురైంది. బుధవారం (ఆగస్టు 30) ఉదయం ఆయనకు రైల్వే కోర్టులో ఊరట లభించింది. 2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో..
TNN 30 Aug 2017, 6:47 pm
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు వింత అనుభవం ఎదురైంది. బుధవారం (ఆగస్టు 30) ఉదయం ఆయనకు రైల్వే కోర్టులో ఊరట లభించింది. 2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలీలో రైల్ రోకో నిర్వహించి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఆయన కేసు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోర్టులో సానుకూల తీర్పు వెలువడటంతో కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈలోపే ఇంకా ఆరు కేసులు పెండింగ్లో ఉన్నాయంటూ లాయర్ గుర్తు చేయడంతో.. మళ్లీ నిరుత్సాహానికి గురయ్యారట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కేటీఆర్తో పాటు తెలంగాణ మంత్రులు.. నాయిని నర్సింహా రెడ్డి, కేటీఆర్, పద్మారావుకు కూడా సికింద్రాబాద్ రైల్వే కోర్టులో ఉపశమనం లభించింది. దీనిపై గత కొన్నేళ్లుగా వీళ్లు విచారణకు హాజరవుతున్నారు.
Just when I was about to heave a sigh of relief after completion of a railway court case today, lawyer informs me that 6 more are pending!🙄 — KTR (@KTRTRS) August 30, 2017
కేటీఆర్తో పాటు తెలంగాణ మంత్రులు.. నాయిని నర్సింహా రెడ్డి, కేటీఆర్, పద్మారావుకు కూడా సికింద్రాబాద్ రైల్వే కోర్టులో ఉపశమనం లభించింది. దీనిపై గత కొన్నేళ్లుగా వీళ్లు విచారణకు హాజరవుతున్నారు.
Just when I was about to heave a sigh of relief after completion of a railway court case today, lawyer informs me that 6 more are pending!🙄 — KTR (@KTRTRS) August 30, 2017