యాప్నగరం

హైదరాబాద్: భారీ వర్షాలకు ఏడుగురి బలి

భారీ వర్షాలకు భాగ్య నగరం మునిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో సాధారణ జన జీవితం అస్తవ్యస్తమైంది.

TNN 31 Aug 2016, 3:07 pm
భారీ వర్షాలకు భాగ్య నగరం మునిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో సాధారణ జన జీవితం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతోంది. కాలువలు, మ్యాన్ హోల్స్ లోంచి నీరు బయటికి పొంగి పొర్లుతోంది. తెలుగురాష్ట్రాల్లో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుధ,గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి రోడ్లమీద భారీగా నీళ్లు నిలుస్తుండడంతో ప్రయాణాలు ఓ గంట పాటూ వాయిదా వేసుకోమని అందరినీ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఆఫీసులకు గంట పాటూ ఆలస్యంగా రమ్మని మరీ చెప్పింది. చాలా లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి వెళ్లిపోయింది. భోలక్ పూర్ లోని ఓ ఇల్లు కూలి ఇద్దరు కూతుళ్లు, తల్లీ చనిపోయారు. రామంతాపూర్ లో భవనం పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
Samayam Telugu rains battered hyderabad 7 dead
హైదరాబాద్: భారీ వర్షాలకు ఏడుగురి బలి





తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.