తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఛత్తీస్ ఘడ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే బంగాళాఖాతం నుంచి తేమ గాలులు కూడా వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మేఘాలు ఆవరించాయి. దీంతో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్పింది. రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడొచ్చని చెప్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆకాశంలో మేఘాలు ఆవరించాయి. ఆదివారం అనంతపురంలో అత్యధికంగా 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్పింది.
TNN 6 Mar 2017, 7:48 am