ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. బీజేపీ, టీడీపీలతో పాటు తనకు మద్దతిస్తున్న టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. కోవింద్కు ఘనస్వాగతం పలికేందుకు అన్ని పార్టీలూ సిద్ధంగా ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం తెగ హంగామా చేస్తోంది. హైదారాబాద్ను స్వాగత బ్యానర్లతో నింపేసింది. హైదరాబాద్కు విచ్చేస్తున్న రామ్నాథ్ కోవింద్కు ఘనస్వాగతం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతో ప్రధాన కూడళ్లలో పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటుచేశారు.
బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి, కోవింద్కు స్వాగతం పలకాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకి ప్రత్యేక విమానంలో కోవింద్ బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి హరితప్లాజాకు చేరుకుని 10 గంటల నుంచి 10.30 వరకు బీజేపీ ప్రతినిధులతో, 10.30 నుంచి 10.45 వరకు టీడీపీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం 11.15 నుంచి 12 గంటల వరకు హోటల్ పార్క్ హయత్లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు.
అనంతరం జలవిహార్లో టీఆర్ఎస్ నేతలతో కోవింద్ సమావేశం అవుతారు. 12.15 నుంచి 1 గంట మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడే సీఎంతో కలిసి భోజనం చేస్తారు. 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.
బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి, కోవింద్కు స్వాగతం పలకాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకి ప్రత్యేక విమానంలో కోవింద్ బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి హరితప్లాజాకు చేరుకుని 10 గంటల నుంచి 10.30 వరకు బీజేపీ ప్రతినిధులతో, 10.30 నుంచి 10.45 వరకు టీడీపీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం 11.15 నుంచి 12 గంటల వరకు హోటల్ పార్క్ హయత్లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు.
అనంతరం జలవిహార్లో టీఆర్ఎస్ నేతలతో కోవింద్ సమావేశం అవుతారు. 12.15 నుంచి 1 గంట మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడే సీఎంతో కలిసి భోజనం చేస్తారు. 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.