యాప్నగరం

వైఎస్ జగన్‌తో రమణ దీక్షితులు సమావేశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.

Samayam Telugu 7 Jun 2018, 5:38 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. హైదరాబాద్‌లో ఈ సమావేశం జరిగింది. దాదాపు ఇరవై నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. గత కొన్నాళ్లుగా సంచలన ప్రకటనలు చేస్తూ.. తితిదే బోర్డు నిర్ణయాలను తప్పు పడుతూ వస్తున్న రమణ దీక్షితులు ఇప్పుడు వైఎస్ జగన్‌తో సమావేశం కావడం ఒకింత సంచలన అంశం అవుతోంది. ఇది వరకే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో కూడా దీక్షితులు సమావేశం అయ్యారు. ఇప్పుడు జగన్‌ను కలిశారు.
Samayam Telugu ramana.


తనను కలవడానికి వచ్చిన రమణ దీక్షితులను సమావేశానంతరం జగన్ స్వయంగా ప్రధాన ద్వారం వరకూ వచ్చి సాగనంపారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మాట్లాడుతూ..తమ కష్టాలను చెప్పుకునేందుకే తను జగన్‌ను కలిసినట్టుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కష్టాలను వినడం లేదని, పలుసార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదని... ఈ నేపథ్యంలో జగన్‌ను కలిసినట్టుగా వివరించారు.

తమకు రాజకీయాలు అవసరం లేదని, స్వామివారి కైంకర్యం చేసే అవకాశం ఉంటే చాలని.. తనకు ఈ అవకాశం లేకుండా చేశారని ఆయన అన్నారు. ఈ విషయమై జగన్‌కు చెప్పుకున్నాను... అని అన్నారు. తమకు ఏ పార్టీ అయినా ఒకటే అన్నారు.

తిరుమలలో కొన్ని అపచారాలు జరిగాయనే అంశంలో తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టుగా రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరపాలని ఈయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.