ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రామ్నాథ్ మంగళవారం (జులై 4) హైదరాబాద్లోని జలవిహార్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్కు భారీ విజయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం తన ప్రగతి కోసం భవిష్యత్తులో కోవింద్ ఆశీస్సులు కోరుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని, తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపామని, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ ప్రథమం స్థానంలో ఉందని సీఎం అన్నారు. ‘రాష్ట్రపతి కార్యాలయంలో మీరు పూర్తి సఫలత సాధించాలని ఆశిస్తున్నా. దేశాన్ని ఆర్థిక వృద్ధి దిశగా తీసుకెళుతున్న ప్రధాని మోదీకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని కేసీఆర్ అన్నారు. అంతకుముందు రామ్నాథ్ను సీఎం కేసీఆర్ శాలువ కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించినందుకు టీఆర్ఎస్కు, కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కోవింద్కు మద్దతు ప్రకటించిన తొలి ఎన్డీయేతర పార్టీ టీఆర్ఎస్ అని ఆయన ప్రసంశించారు. ‘కోవింద్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. గవర్నర్గా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్రపతి పదవికి కోవింద్ సరైన వ్యక్తి’ అని వెంకయ్య పేర్కొన్నారు.
రామ్నాథ్ కోవింద్ కోసం కేసీఆర్ జలవిహార్లో ప్రత్యేకంగా విందు కూడా ఏర్పాటు చేయించారు. ఇందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ సహా పలువురు బీజేపీ నేతలు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ విందు అనంతరం కోవింద్ విజయవాడకు పయనం కానున్నారు. అంతకుముందు ఆయన పార్క్ హయత్లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్, వైఎస్సార్సీపీ నేతలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించినందుకు టీఆర్ఎస్కు, కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కోవింద్కు మద్దతు ప్రకటించిన తొలి ఎన్డీయేతర పార్టీ టీఆర్ఎస్ అని ఆయన ప్రసంశించారు. ‘కోవింద్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. గవర్నర్గా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్రపతి పదవికి కోవింద్ సరైన వ్యక్తి’ అని వెంకయ్య పేర్కొన్నారు.
రామ్నాథ్ కోవింద్ కోసం కేసీఆర్ జలవిహార్లో ప్రత్యేకంగా విందు కూడా ఏర్పాటు చేయించారు. ఇందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ సహా పలువురు బీజేపీ నేతలు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ విందు అనంతరం కోవింద్ విజయవాడకు పయనం కానున్నారు. అంతకుముందు ఆయన పార్క్ హయత్లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్, వైఎస్సార్సీపీ నేతలతో భేటీ అయ్యారు.