యాప్నగరం

మధుకర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

అనుమానాస్పదంగా మృతి చెందిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత

Samayam Telugu 10 Apr 2017, 6:09 pm
అనుమానాస్పదంగా మృతి చెందిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మధుకర్‌ మృతదేహానికి సోమవారం మరోసారి శవపరీక్ష నిర్వహించారు. వెంకటాపూర్‌కు చెందిన ఓ యువతి (అగ్రకులం)తో ప్రేమవ్యవహారం కారణంగానే హత్య జరిగిందని బంధువులు ఆరోపించడంతో ఈ ఘటనపై అనుమానాలు పెరిగాయి. ఈ క్రమంలో మధుకర్ తల్లిదండ్రులు మళ్లీ శవపరీక్ష కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమవారం మధుకర్‌ తల్లిదండ్రుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు. ఉస్మానియా వర్సిటీ (హైదరాబాద్) ఫోరెన్సిక్‌ నిపుణులు దేవరాజ్‌, కాకతీయ వర్సిటీ (వరంగల్) నుంచి కృపాల్‌సింగ్‌ ల ఆధ్వర్యంలో ఈ శవపరీక్ష జరిగింది. సుమారు నాలుగు గంటలపాటు శవపంచనామా నిర్వహించిన నిపుణులు శవం కుళ్లిపోయిందని, భాగాలన్నీ తీసుకున్నట్టు తెలిపారు. వారం రోజుల్లో హైకోర్టుకు శవపరీక్షపై నివేదిక అందించనున్నట్టు నిపుణులు వెల్లడించారు.
Samayam Telugu re post mortem completes for madhukars dead body
మధుకర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి


రీ పోస్టుమార్టాన్ని వీడియోలో చిత్రీకరించారు.

గత నెల14న ఖానాపూర్‌ సమీపంలోని చెట్లపొదల్లో మధుకర్‌ శవమై కన్పించాడు. 15న శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని గ్రామ సమీపంలోనే ఖననం చేశారు. మధుకర్ ది ముమ్మాటికీ హత్యేని ఆయన కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

న్యాయవ్యస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, మధుకర్ ది హత్యేనని, హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధుకర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

మధుకర్ ను ప్రేమించిన అమ్మాయిని కూడా పోలీసులు విచారించి.. న్యాయంగా వ్యవహారించాలని..ఇప్పటి వరకు ఆమె ఎక్కడుందో తెలియకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.