సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్స్టర్ నయూమ్ గురించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. ఓ కథనం ప్రకారం ఈ గ్యాంగ్స్టర్ ఏకంగా కేసీఆర్ సన్నిహితులనే టార్గెట్ చేశాడట. సీఎం కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ క్లాస్ 1 కాంట్రాక్టర్పై కన్నేసిన నయీమ్.. ఆయన నుంచి రూ.50 కోట్లు వసూలు చేయాలని భావించాడట. అందులో భాగంగా సదరు కాంట్రాక్టర్తో మాట్లాడాలని ప్రయత్నించాడని సమాచారం. కానీ నయీమ్తో మాట్లాడేందుకు ఆ కాంట్రాక్టర్ అంగీకరించలేదు. దీంతో అతడి సంగతి తేల్చుకునేందుకు రంగంలోకి దిగిన నయీమ్.. తన మనుషులతో ఆ వ్యక్తి ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ కాంట్రాక్టర్ విషయాన్ని సీఎం కేసీఆర్ చెవిన వేశాడట. అప్పటికే భువనగిరి ఎమ్మెల్యేతోపాటు మరో ఎమ్మెల్యేను సైతం బెదరించి భూదందాకు పాల్పడిన ఫిర్యాదులు కూడా సీఎంకు అందాయి. రాజధాని ప్రాంతంలో భూముల విషయమై అనేక మందిని బెదిరించడంతోపాటు.. పలు హత్యల్లోనూ నయీమ్ పాత్ర ఉంది. దీంతో నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
నయీం ఎన్కౌంటర్కు కారణాలివేనా!
నయీం ఎన్కౌంటర్కు సంబంధించి పలు ఆసక్తికర కారణాలు వెలుగు చూస్తున్నాయి..
Samayam Telugu 9 Aug 2016, 9:47 am