యాప్నగరం

ప్రాణం కాపాడిన ‘టీషర్ట్’.. ఆత్మహత్య భగ్నం!

ఆత్మహత్య చేసుకోడానికి వెళ్లిన యువతిని ఆమె దుస్తులే కాపాడాయి. ఇంతకీ ఏం జరిగింది?

Samayam Telugu 10 Oct 2018, 6:33 pm
రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన 20 ఏళ్ల యువతిని.. ఆమె వేసుకున్న దుస్తులే రక్షించాయి. నిండు ప్రాణాలను కాపాడాయి. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేశముద్రం గ్రామం పెద్ద చెరువు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ నివాసి అని పోలీసులు తెలిపారు.
Samayam Telugu Untitled1911


ఆత్మహత్య చేసుకోడానికి కేశముద్రం రైల్వే ట్రాక్ మీద నడుస్తున్న యువతి విజయవాడ నుంచి సికింద్రబాద్ వెళ్తున్న శాతవాహన రైలు కింద పడేందుకు ప్రయత్నించింది. అయితే, ఆమె వేసుకున్న టీషర్ట్ వల్ల ప్రాణాలతో బయటపడింది. ఆమె ఎర్ర టీషర్ట్ ధరించడంతో రైల్వే డ్రైవర్ దూరం నుంచే ఆమెను పసిగట్టాడు. ఏదో ప్రమాదం పొంచివుందని భావించి రైలు ఆపాడు. దీంతో, అక్కడి స్థానికులు కూడా హుటాహుటిన పట్టాల వద్దకు వెళ్లి ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సమయానికి బ్రేకులు వేసి రైలు ఆపిన లోకో పైలెట్‌ను అభినందించారు.

పట్టాలు విరిగినా, ఏదైనా ప్రమాదం పొంచివున్నా.. ఎర్ర జెండా లేదా ఎర్రని వస్తువులను చూపిస్తే రైలును వెంటనే ఆపేస్తారు. ఈ నేపథ్యంలో.. ఆ యువతి ఎర్ర టీషర్ట్‌తో ట్రాక్ పైకి రావడంతో లోకో‌పైలెట్ ప్రమాదాన్ని గురించి రైలు ఆపాడు. లేకపోతే రైలు వేగంగా ఆమెను ఢీకొనేది.
Read this article in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.