యాప్నగరం

సంపత్, కోమటిరెడ్డికి హైకోర్టులో ఊరట

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. శాసనసభ సభ్యత్వాల రద్దుపై ఈసీకి ఇచ్చిన గెజెట్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు వారాల వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ఈసీకి సూచించింది.

Samayam Telugu 19 Mar 2018, 5:02 pm
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. శాసనసభ సభ్యత్వాల రద్దుపై ఈసీకి ఇచ్చిన గెజిట్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు వారాల వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ఈసీకి సూచించింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను... ఈ నెల 22లోగా సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంపత్‌కుమార్ సభ్యత్వం రద్దుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Samayam Telugu relief to telangana congress mlas sampath komatireddy in high court
సంపత్, కోమటిరెడ్డికి హైకోర్టులో ఊరట


ఈ కేసుపై కోర్టులో వాదనలు వాడీవేడిగా జరిగాయి. అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభా వ్యవహారాల శాఖ తరపున అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం శాసనసభా సమావేశాల పరిధిలోకే వస్తుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినప్పుడు సభ్యత్వం రద్దు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుందని పేర్కొన్నారు. సభ్యుల అనుచిత ప్రవర్తన ఆధారంగా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.