యాప్నగరం

ఏపీలో రిపబ్లిక్ డే: సీఎం ఎక్కడా?

ఆంధ్రప్రదేశ్‌లోని గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గైర్హాజరు కావడానికి కారణం ఇదే!

TNN 26 Jan 2018, 12:57 pm
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ జెండాను గవర్నర్‌ నరసింహన్‌ ఎగురవేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అయితే, ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపించకపోవడం చర్చనీయమైంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన శుక్రవారం ఇండియాకు చేరాల్సి ఉంది.
Samayam Telugu republic day celebrations in andhra pradesh cm chandrababu stuck in abu dhabi airport
ఏపీలో రిపబ్లిక్ డే: సీఎం ఎక్కడా?


దావోస్ నుంచి ఆయన గురువారమే రాష్ట్రానికి బయలుదేరారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటలకు ఆయన అమరావతి రావాల్సి ఉంది. అయితే, అబుదాబిలో దట్టమైన పొగమంచు వల్ల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి విమానం సమయానికి బయల్దేరలేదు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన అమరావతి చేరుకునే అవకాశాలున్నాయి.

చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో సీఎం అధికారిక నివాసంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. అక్కడ ఉన్న సిబ్బందికి ఆమె మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.