హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. మెహదీపట్నం పరిధి గుడి మల్కాపూర్లోని విజయశ్రీ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 406లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతుణ్ని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మల్లికార్జున్గా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన గది మొత్తం దాదాపు కాలి బూడిదైంది. తన భర్తకు సిగరెట్ తాగే అలవాటు చాలా ఎక్కువని, బహుశా కింద పడేసిన సిగరెట్ కర్టెన్కు అంటుకుని ప్రమాదం జరిగి ఉండొచ్చని మృతుడి భార్య చెబుతున్నారు.
ఉదయం తాను 6.30 గంటలకు లేచానని అప్పటికే గదిలో నుంచి పొగలు వస్తుండటంతో తలుపు తెరిచే ప్రయత్నం చేశానని చెప్పారు. అయితే తలుపు తెరుచుకోకపోవడంతో చుట్టుపక్కన వాళ్లను పిలిచి తలుపు పగల గొట్టించానని వెల్లడించారు. తన భర్త రాత్రి పడుకున్నప్పుడు తలుపు గడియ పెట్టుకున్నారని చెప్పారు. తను, తన భర్త రోజూ వేరు వేరు గదుల్లో పడుకుంటామని, నిన్న కూడా అలానే చేశామని వెల్లడించారు. కాగా, మల్లికార్జున్ నిద్రలోనే సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపింది.
ఉదయం తాను 6.30 గంటలకు లేచానని అప్పటికే గదిలో నుంచి పొగలు వస్తుండటంతో తలుపు తెరిచే ప్రయత్నం చేశానని చెప్పారు. అయితే తలుపు తెరుచుకోకపోవడంతో చుట్టుపక్కన వాళ్లను పిలిచి తలుపు పగల గొట్టించానని వెల్లడించారు. తన భర్త రాత్రి పడుకున్నప్పుడు తలుపు గడియ పెట్టుకున్నారని చెప్పారు. తను, తన భర్త రోజూ వేరు వేరు గదుల్లో పడుకుంటామని, నిన్న కూడా అలానే చేశామని వెల్లడించారు. కాగా, మల్లికార్జున్ నిద్రలోనే సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపింది.