యాప్నగరం

టీడీపీకి రేవంత్‌రెడ్డి గుడ్‌బై.. చంద్రబాబుకి లేఖ

గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తెలంగాణ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు.

TNN 28 Oct 2017, 2:31 pm
గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తెలంగాణ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి తెలుగు దేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. శనివారం విజయవాడ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. చంద్రబాబునాయుడిని కలిశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి.. లేఖను అధినేత చంద్రబాబుకు అందజేశారు. కాగా, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి, అరవింద్‌కుమార్‌గౌడ్‌లు కూడా ఈరోజు విజయవాడకు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
Samayam Telugu revanth reddy goodbye to telugu desam party
టీడీపీకి రేవంత్‌రెడ్డి గుడ్‌బై.. చంద్రబాబుకి లేఖ


కాగా, రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామాచేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలతో పాటు టీటీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు. టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవడం, ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరగడంతో ఈ వ్యవహారం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వరకు వెళ్లింది. మొన్నటి వరకు విదేశీ పర్యటనలతో ఉన్న చంద్రబాబునాయుడు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో బుధవారం ఫోన్‌లో మాట్లాడారు.

రేవంత్‌ వ్యవహరాన్ని బాబుకు వివరించిన రమణ.. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు శుక్రవారం పార్టీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాలపై విస్తృతంగా చర్చించేందుకు నేతలను విజయవాడకు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలంతా విజయవాడ వెళ్లారు. చంద్రబాబుతో భేటీ అయిన రేవంత్‌రెడ్డి తన రాజీనామాను సమర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.